GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 7:46 pm Posted by : GURU SWAMY

శంకర్ రెడ్డికి ఆహ్వానం పలికిన దళవాయి అగ్రహారం గ్రామస్థులు

జాతరకు విచ్చేయ్యండి…

* శంకర్ రెడ్డికి ఆహ్వానం పలికిన దళవాయి అగ్రహారం గ్రామస్థులు

జాతరకు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని టీడీపీ సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డినీ దళవాయి అగ్రహారం గ్రామస్థులు కోరారు. మే 13, 14 తేదీలో నిర్వహిస్తున్న అమ్మవారి జాతరను పురస్కరించుకొని గురువారం గ్రామపెద్దలు ఆయనని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రతియేటా సత్యవేడు గంగ జాతరతోపాటు అగ్రహారం జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తామని తప్పకుండా హాజరు అయ్యి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.