సదుం గరుడ ధాత్రి జూలై 31
సదుం మండలం జాండ్రపేటలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాడ మాసం మూడో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించారు. శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు రఘునాథరావు విశేషంగా అలంకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. కర్ణ హరినాథ్ కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా వ్యవహరించారు. అన్నదానం జరిపించారు.