బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16
బైరెడ్డిపల్లి సమీపం లోని మాతాజీ గుడి దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.బైరెడ్డిపల్లి వైపు నుంచి బెంగళూరుకు ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారుడు కి శునకం అడ్డం రావడంతో తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్న వారు 108 కి కాల్ చేయగా బైరెడ్డిపల్లి 108 హటావోటి అక్కడ చేరుకొని బైక్ మీద పడిపోయిన వ్యక్తి సంజయ్ (23) ను అంబులెన్స్ లో ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం భాధితుడికి చెందిన రెండు సెల్ ఫోన్లు , రోడ్డుమీద పడి ఉన్న
17 వేల 500 రూపాయలను నగదునుతీసుకొని 108 సిబ్బంది జాగ్రత్తగా తీసుకొని భాధితుడికి పైలెట్ గౌస్ బాషా, ఈఎంటి బిందు అందచేసిప్రజల చే శభాష్అనిపించుకొన్నారు.