GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 7:56 am Posted by : GURU SWAMY

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి..!

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి..!

‘రూ.3 లక్షల బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త.పెళ్లై రెండు నెలలు కూడా కాకముందే తేజశ్రీ మృతి కలకలం.
రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చినా ఆగని వేధింపులు.మరో యువతిని ఇంటికి తీసుకురావడంపై ప్రశ్నించగా మొదలైన హింస.బైక్ కొనిచ్చిన తర్వాత కూడా భూమి, నల్లపూసలు కావాలంటూ ఒత్తిడి.ఆల్బమ్ డబ్బుల పేరుతో మరో రూ.50 వేల వసూలు చేసిన భర్త కుటుంబం.
ఘటన రోజు దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి.“మీ పాప ఉరివేసుకుంది” అంటూ ఫ్రెండ్‌తో ఫోన్ చేయించిన భర్త.ఘటనాస్థలానికి చేరుకున్న తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యం.
బెడ్‌పై విగతజీవిగా తేజశ్రీ.. మెడ, కాళ్లపై గాయాలు ఉన్నాయని ఆరోపణలు.
“హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు” అంటూ భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు.
విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.నిందితుడు సోమేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.