GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 5:47 am Digital Edition : GURU SWAMY

శ్రీసిటీని సందర్శించిన జెట్రో బృందం

శ్రీసిటీని సందర్శించిన జెట్రో బృందం

జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO) కు చెందిన ప్రతినిధుల బృందం శ్రీసిటీని సందర్శించింది. డైరెక్టర్ జనరల్ కియోటాకా దోహో ఆధ్వర్యంలో వచ్చిన బృందానికి శ్రీసిటీ అధికారులు స్వాగతం పలికి, మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారుల అనుకూల వాతావరణంపై వివరించారు.

శ్రీసిటీ అభివృద్ధి, జపాన్ సంస్థల విస్తరణపై జెట్రో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండో-జపాన్ పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.