శ్రీ వేదనారాయణ స్వామికి గొడుగులు వితరణ

నాగలాపురంలో వెలసిన శ్రీ వేదనారాయణ స్వామికి గరుడసేవకు రెండు గొడుగులను శ్రీ రామానుజచర్య ట్రస్ట్ తిన్ననుర్ వారు ఆలయ డిప్యుటీ ఏవోకి మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ డిప్యుటీ ఏవో దాతలకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.