GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 10:33 pm Digital Edition : GURU SWAMY

సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం

* కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్.
కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్):కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ స్పష్టం చేశారు.కుప్పం మండలం మహమ్మద్‌పురం గ్రామపంచాయతీ కృష్ణాపురం గ్రామంలో బూత్ 144లో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో బాగంగా,రెండేళ్లు నమ్మకం సంక్షేమం అభివృద్ధి,మన మంచి కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమన్ని కార్యక్రమాన్ని వివరించారు. సమస్య వుంటే తెలుసుకోని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన, మహిళలకు కరపత్రాలు పంపిణీ చేసి సంక్షేమ పథకాల అమలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.