సత్యవేడులో ఘనంగా ‘రెవెన్యూ డే’ వేడుకలు

గరుడధాత్రి : సత్యవేడు తహసిల్దార్ శివప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శనివారం 'రెవెన్యూ డే' (రాష్ట్ర రెవెన్యూ దినోత్సవం) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను డిప్యూటీ తహసిల్దార్లు డి. వెంకటేశ్వర్లు, త్యాగరాజు కట్ చేసి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్లు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య రెవెన్యూ శాఖ ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో...