GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:38 pm Digital Edition : GURU SWAMY

సత్యవేడు గంగమ్మ జాతర వేడుకలకు జడ్పిటిసికి ఆహ్వానం

సత్యవేడు గంగమ్మ జాతర వేడుకలకు జడ్పిటిసికి ఆహ్వానం

తిరుపతి జిల్లా సత్యవేడులో మే 13,14 తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర వేడుకలకు స్థానిక జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానించారు.బుధవారం గంగమ్మ జాతర మహోత్సవ కమిటీ సభ్యులు అడ్వకేట్ గోపీనాథ్, ప్రసాద్ రెడ్డి,మురళి,విజయ్ కుమార్,రాజేష్ రెడ్డి తదితరులు జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.ఈ నేపథ్యంలో గంగమ్మ ఊరేగింపు, దర్శనం సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి తగు చర్యలు తీసుకోవాలని,ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా గంగమ్మ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.