నారాయణవనం జూన్ 14 గరుడధాత్రి న్యూస్ ;
సత్యవేడు నియోజకవర్గ టిడిపి బీఎల్ఏ ఇన్చార్జిగా నియమితులైన కోనేటి సుమన్ కుమార్ తిరుపతి కార్యాలయంలో సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి బిఎల్ఎ ఇన్చార్జిగా నియామక ధ్రువపత్రాలను కోనేటి సుమన్ కుమార్ కు అందజేశారు . ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆయనతో కలిసి ధ్రువపత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని,నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కోనేటి సుమన్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.