GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 6:54 pm Posted by : GARUDA DHATRI NEWS

సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నరసింహులు బాధ్యతల స్వీకరణ

సత్యవేడు, జూన్ 1 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నరసింహులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతి పొంది సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది డాక్టర్ నరసింహులను సాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా అభినందించారు.అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ కళాశాల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అధ్యాపకుల సహకారంతో ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.