వెదురు కుప్పం. గరుడ దాద్రి న్యూస్:
వెదురు కుప్పం మండలం యనమల మంద పంచాయతీ యనమల మంద గ్రామంలో శుక్రవారం ఎర్ర కృష్ణారెడ్డి తల్లి సావిత్రమ్మ మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు కామసాని పద్మనాభరెడ్డి, అదేవిధంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షులు వెంట, రెడ్డి సంఘం అధ్యక్షులు దేవరాజుల రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మనేంద్ర, బాల, మహేష్, సాంబ, కొండ కింద పల్లి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, ఎస్ఎస్సిపి పార్టీ నాయకులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.