సీఎం సతీమణి నారా భువనేశ్వరి ని కలిసిన టిడిపి నేతలు
కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ని తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు కలిశారు. కుప్పం నియోజకవర్గం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరిని టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్, రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, శాంతిపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్ నాయుడు, గుడిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి, రామకుప్పం తెలుగుదేశం...