సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెండి కిరీటం బహుకరణ

కార్వేటి నగరం ఆగస్టు 13 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో తిరుపతికి చెందిన డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ సతీమణి ఉమారాణి దాదాపు లక్ష రూపాయలు విలువైన, 370 గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటాలను అమ్మవార్లకు గురువారం బహుకరించారు, త్వరలో స్వామివారికి ప్రత్యేకంగా యజ్ఞోపవేతం కూడా తయారు చేయిస్తున్నారు, అనంతరం దాతను ఆలయ కమిటీ అధ్యక్షులు రాంశెట్టి రాజశేఖర్ వారి దంపతులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.