కార్వేటినగరం సెప్టెంబర్ 4 (గరుడ దాత్రి న్యూస్): గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్. వి.ఎం. థామస్ఆదేశాల మేరకు(106)వ బూత్ కు సంబంధించిన సురేంద్ర నగరం, దాసరిగుంట, ద్వారకానగరం, హరిజనవాడ, ఆది ఆంధ్రవాడ గ్రామాలలో క్లస్టర్ ఇంచార్జ్(6) వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎం.రాజేంద్ర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుల చెంగల్రాయ యాదవ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి .రాజా, బూత్ కన్వీనర్ బాబు, కో బూత్ కన్వీనర్ శ్రీనివాసు నాయుడు, కె ఎస్ ఎస్ సభ్యులు ఏ. రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్. శ్రీనివాసులు నాయుడు తదితరులు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మై టీడీపీ ఆప్ లో అప్లోడ్ చేసి (106) వ బూతుకు సంబంధించిన *డోర్ టు డోర్* కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగినది.