GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:09 am Digital Edition : GURU SWAMY

19వ వార్డులోని ప్రజలు సర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి

కుప్పం,ఆగస్టు 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పులపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో ఉన్న ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ దామోదర్ నాయుడు తెలిపారు. గురువారం ఆయన ఈ మేరకు వివరాలు తెలిపారు. ఈనెల 22వ తేదీ శనివారం సర్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్యాలెస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ కార్డు లో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్లు నమోదు కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్డు పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.