GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:17 pm Digital Edition : GURU SWAMY

​ఆర్యవైశ్య వివిధ విభాగాల మండల కార్యవర్గాల నియామకం

గరుడ దాత్రి న్యూస్ న్యూస్ మైదుకూరు జులై 25​*

వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, సేవాదళ్ మరియు మహిళా మండలి మైదుకూరు మండల నూతన కార్యవర్గాలను శుక్రవారం రాత్రి స్థానిక అమ్మవారి శాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వల్లంకొండు వెంకటరమణ సలహాలు, సూచనల మేరకు ఈ కమిటీలను పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు.
​నూతన కమిటీల వివరాలు:
​యువజన సంఘం మండల కమిటీ:
​అధ్యక్షులు: తులసి సత్యసాయి
​కార్యదర్శి: భూపాల ఉపేంద్ర
​కోశాధికారి: జొన్నలగడ్డ మనోజ్
​ఆర్యవైశ్య సేవాదళ్ మండల కమిటీ:
​అధ్యక్షులు: అయ్యప్ప శెట్టి సురేంద్ర
​కార్యదర్శి: వాకాటి వెంకటరమణ
​కోశాధికారి: నాగేల్ల శేషుబాబు
​మహిళా మండలి మండల కమిటీ:
​కోశాధికారి: మిట్టా హేమలత
​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నిర్వాహకులు మాట్లాడుతూ.. సమాజ సేవే ధ్యేయంగా, ఆర్యవైశ్యుల సంక్షేమానికి మరియు సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో మైదుకూరు ఆర్యవైశ్య అధ్యక్షులు బల్లాణి చెన్నకేశవ ప్రసాద్, ఉపాధ్యక్షులు దొంతు వెంకటసుబ్బయ్య, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గురు ప్రసాద్, మండల అధ్యక్షులు నూకల సత్యనారాయణ, సభ్యులు కోట సంజీవయ్య గుప్తా, ఇమ్మిడిశెట్టి సతీష్ బాబు, ఆలంపల్లి జనార్ధన్, ధోనిపర్తి ఆయువారప్ప, మహిళా మండల అధ్యక్షురాలు బళ్లాని సునంద, మహిళా మండలి మండల అధ్యక్షురాలు వంకదారి వాసంతి, భూపాలం విజయ, భూపాలం లతతో పాటు పలువురు మహిళా మండలి సభ్యులు, సంఘ బంధువులు పాల్గొన్నారు.