బైరెడ్డిపల్లి మండల వైసీపీ,పార్టీ,కార్యాలయం కు విచ్చేసిన రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై19 బైరెడ్డిపల్లి మండల వైకాపా కార్యలయంను ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా మండలంలో పార్టీ,కార్యక్రమాలు నాయకులు,కార్యకర్తల గురించి కీలక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు మొగశాల కుటింభీకులు తో కలిసి ఉల్లాసంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా, మాజీ జడ్పీ చైర్మన్,మాజీ డి సి.సి.బి. చైర్మన్, వైసిపి,రాష్ట్ర కార్యదర్శి మొగసాల రెడ్డమ్మ కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి ఎం.పి.పి.మొగశాలరెడ్డప్ప, నాయకులు జగదీష్,రాజుతదితరులు పాల్గొన్నారు.