GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 4:36 pm Posted by : GURU SWAMY

ద్రౌపతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ సర్పంచ్ చిన్నదురై సుధా

నాగలాపురంలోని శ్రీ ధర్మరాజుల ఆలయంలో ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా మాజీ సర్పంచ్ చిన్నదురై సుధా ఆదివారం ఉదయం ద్రౌపతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆయనతోపాటు ప్రముఖ వ్యాపారవేత రాజమాణిక్యం, ఆలయ నిర్వాహకులు వినోద్ ఉన్నారు.