సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు

కార్వేటి నగరం జూలై 26 గరుడ దాది న్యూస్ కార్వేటినగరం స్కంద పుష్కరిణి వద్ద కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆర్ఓ ప్లాంట్ ను చెన్నై వాసవిలో రేఖ ఆడిటర్ సాయి నిషా ఫౌండేషన్ వారి బృందం మరియు సుధారాణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ తెలిపారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.