GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:32 pm Digital Edition : GURU SWAMY

కుప్పం పబ్లిక్ స్కూల్ షైనింగ్ స్టార్స్

కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):పదవ తరగతి పరీక్షలలో కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యారులు లక్ష్మిఈశ్వరచంద్ రెడ్డి 597/600 మార్కులు, అనిత షిజో 590/600 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపిక కావడం తమకు మా విద్యాసంస్థకు గర్వకారణం అని కుప్పం పబ్లిక్ స్కూల్ చైర్పర్సన్ ఎన్. శాంత అన్నారు.ఈ షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు 20,000 వేల నగదు పురస్కారం చిత్తురు కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా చిత్తూరు జడ్పీ హలులో జరిగిన ప్రత్యేక సమా వేశంలో అందించడం జరిగింది.షైనింగ్ స్టార్ రివార్డును అందుకొన్న విద్యార్థులను కుప్పం పబ్లిక్ స్కూల్ చైర్పర్సన్ ఎన్. శాంత, హెడ్ మిస్ట్రీస్ వి. దమయంతి మరియు ఉపాద్యాయ బృందం అభినందించారు.