GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:57 am Posted by : GURU SWAMY

పెద్ద చెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై24

బైరెడ్డిపల్లి మండలం లోని
పెద్ద చెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు పండుగ వాతావరణం లో విద్యార్థులు ల తల్లిదండ్రుల సమక్షంలో ను చేపట్టారు.అనంతరం తరగతి గది లో విద్యార్థుల యొక్క ప్రతిభను తరగతుల వారీగా ఊపాధ్యాయులు తల్లితండ్రులకు తెలియ చేయండం జరిగింది.తదుపరి తల్లితండ్రులకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు మరియు ముఖ్య అతిధులు ద్వారా సందేశం అందించారు. ఆ తర్వాత పదవ తరగతి లో ఐదు వందలకు పైన మార్కులు వచ్చిన వారికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సన్మానం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిధి గా రిటైడ్ హెడ్ మాస్టర్ హెచ్.వి. రవి కుమార్ పాల్గొన్నారు.మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మరియుఎస్.ఎం.సి. కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చివరగా సంగీక శాస్త్రం ఉపాధ్యాయులు విద్యార్థులా ఎదుగు దలకు ఆటంకాలు గా ఉన్న సెల్లఫోన్ వంటి సామజిక మధ్యామల నుండి దూరం ఉంచాలి అని తల్లితండ్రులకు విద్య యొక్క ప్రముఖ్యత ను ఆలోచింప చేసే సందేశం ను అందించారు. వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. తల్లితండ్రుల కు మరియు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ను ఏర్పాటుచేశారు.