కార్వేటి నగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం మండలం ఆర్కే విబి పేట పంచాయతీలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.
వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం మొదటగా తల్లిదండ్రులు,గ్రామపెద్దల
స్వాగతంతో మొదలైంది. తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఛాయాచిత్రాలను చిత్రీకరించారు. తరువాత విద్యార్థుల తల్లి
దండ్రులు – టీచర్స్ సమీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరించడం జరిగింది. తరువాత తల్లిదండ్రులకు ఆటలపోటీలు నిర్వహించారు,
అనంతరం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ప్రభుత్వ
ముఖ్య అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయురాలు మోహనమ్మ
వివరించారు.ఈ కార్యక్రమానికి యాజమాన్య కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు హాజరైనారు. కాలుష్య నివారణ సభ్యులు నాగేశ్వరరాజు , మాజీ జడ్పిటిసి సభ్యులు దేవకి లోకనాధరెడ్డి, చంద్రమౌళి రెడ్డి నాగభూషణం రెడ్డి గారు, వెంగళరాయుడు
గారు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరైనారు.