* రూ.2.10 కోట్ల బకాయిల వసూలే లక్ష్యం
* 29న ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
* చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ల తొలగింపు: సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ ప్రకటన
గడుర దాత్రి న్యూస్ మైదుకూరు, జూలై 26:
మైదుకూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని SC, ST కాలనీల్లో దీర్ఘకాలంగా బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల వసూలు కోసం రేపటి జూలై 27నుంచి ఈ నెల చివరి వరకు ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజనల్ అధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు మరియు వనిపెంట సెక్షన్లలో ఉన్న SC, ST వినియోగదారుల నుంచి మొత్తం రూ. 2 కోట్ల 10 లక్షలు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
మండలాల వారీగా బకాయిలు:
ఖాజీపేట మండలం: రూ. 60 లక్షలు
చాపాడు మండలం: రూ. 50 లక్షలు
దువ్వూరు మండలం: రూ. 50 లక్షలు
మైదుకూరు మండలం: రూ. 50 లక్షలు
29న సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్:
ముఖ్యంగా జూలై 29 బుధవారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది నందరినీ రెండు ప్రత్యేక గ్రూపులుగా విభజించి, ఎక్కువ బకాయిలు ఉన్న కాలనీల్లో నేరుగా వసూలు కార్యక్రమం చేపడతారని వెల్లడించారు.