బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై24
గ్రామాభివృద్ధే ధ్యేయం, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వంలక్ష్యం అని బైరెడ్డిపల్లి మండలం టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పలమనేరు నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం
అందించేందుకు “మన ఊరికి మన ఎమ్మెల్యే” కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం!
ఈ నెల 27 నుండి పలమనేరు నియోజకవర్గం
గ్రామాభివృద్ధి, సంక్షేమం మరియు పారదర్శక పాలన దిశగా వేస్తున్న ఈ అడుగులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం అన్నారు. సమస్యల పరిష్కారానికి మీ వద్దకే మీ నాయకుడు వస్తున్నారని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలు పరిష్కారం పొందాలని ఆయన పిలుపునిచ్చారు.