కార్వేటి నగరం ఆగస్టు 7 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటి నగరం కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా శుక్రవారం ఆలయంలో స్వామి అమ్మ వాళ్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద వేద పండితులు మంత్రోచ్ఛారణ మంగళ వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణ్ ఉత్సవంలో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయ దాతలుగా నీరజ గోపాల్ నాయుడు, కావేరి పురుషోత్తం మొదలియార్, జయలక్ష్మి దొరస్వామి రెడ్డి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్, కార్యనిర్వ కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, గోవిందస్వామి, వినయ్, సెల్వి అమరావతి తులసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
