ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రసాద వితరణ -దాతకు సన్మానం

శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రసాద వితరణ -దాతకు సన్మానం

📰 Generate e-Paper Clip

పలమనేరు, జూన్ 15 (గరుడ ధాత్రి ) : స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాత చిట్టి బాబు కుటుంబ సభ్యుల సౌజన్యంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వందలాది మంది భక్తులకు దాతల సహకారంతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాద వితరణ ధాతను ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ మంజునాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అర్చకులు కుమార్, చంద్రమౌళి గురుకుల్ వేద ఆశీర్వ చనాలతో, కమిటీ సభ్యులు శాలువా కప్పి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, రెడ్డప్ప, బాబు, వీరప్పతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!