ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పుత్తూరు మండలంలో జరిగిన శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పుత్తూరు మండలంలో జరిగిన శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం హాజరయ్యారు.
పుత్తూరుకు చెందిన టి. సుందర్ రాజన్ కుమారుడు టి. శ్రావణ్ కుమార్ వివాహ రిసెప్షన్ వేడుక పుత్తూరు టౌన్‌లోని ఆర్డీఎం గేట్ సమీపంలోని వీఎస్‌ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!