శివయ్య సేవలో.. నర్సాపూర్ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆయనను ఆలయ అధికారులు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ మహేష్ పాల్గొన్నారు.
