మంత్రి నారా లోకేష్ కు ఆత్మీయ స్వాగతం
సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం ఆరూరు పంచాయతీలో నూతన క్యారియర్ ఏసీ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా నాగలాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీజేబీ ప్రణీత్ రెడ్డి , టీడీపీ యువ నాయకుడు నరేంద్ర రెడ్డి శ్రీ సిటీ హెలిపాడ్ సమీపంలో పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పారు.
