కార్వేటినగరం జూలై 20 గరుడ దాత్రి న్యూస్
కార్వేటి నగరం చెరువు కట్టకు ఆనుకొని సుద్దగుంట గ్రామం సమీపమున వెలసియున్న శిష్ట సౌందర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం ఉదయం సదాశివేశ్వర స్వామి వారికి అభిషేక పూజా కార్యక్రమం మరియు మధ్యాహ్నం అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించబడినది. దాతలు కార్వేటినగరం బీసీ కాలనీ నివాసస్తులు . కేశవముడి ధనలక్ష్మి కుమారుడు కోడలు శరవణ, ముని లక్ష్మి కుమారులు పయణి, షణ్ముగం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోహన రాజు, కార్యదర్శి రాజేంద్ర రెడ్డి, సుబ్బరాయల్ యాదవ్, జయ రెడ్డి, లక్ష్మీపతి, జగదీష్, నాగయ్య, సత్య,పండబ్బ, పూజారులు ప్రహల్లాద స్వామి, రవిచంద్రన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
