బి కొత్తకోట జూలై:21(గరుడ దాత్రి న్యూస్)
భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కావాడి రవీంద్ర నియమితులవడం గిరిజన సమాజానికి ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలు, సామాజిక సమస్యలపై తీసుకున్న చొరవను గుర్తించి పార్టీ అధిష్ఠానం ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గిరిజనుల సంక్షేమం,విద్య, ఉపాధి,ఆరోగ్యం,భూ హక్కులు, అటవీ హక్కులు వంటి కీలక అంశాలపై మరింత సమర్థంగా పనిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు కావాడి రవీంద్రపై ఉంది.గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేయనున్నారు.రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, యువతను రాజకీయంగా మరియు సామాజికంగా చైతన్యవంతం చేయడం ఆయన ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు,గిరిజన సంఘాల ప్రతినిధులు కావాడి రవీంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో గిరిజన మోర్చా మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గిరిజనుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం, విద్యార్థులకు విద్యా అవకాశాలు, యువతకు ఉపాధి, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన సంకల్పించారు.
అంతేకాకుండా, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, అడవులపై ఆధారపడే గిరిజన కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం కూడా ప్రాధాన్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం,ప్రతి గిరిజన కుటుంబంతో అనుబంధం పెంచుకోవడం,యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలను విస్తరించడం ద్వారా గిరిజన మోర్చాను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని కావాడి రవీంద్ర తెలిపారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి పార్టీ మరియు ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.ఈ నియామకం గిరిజన సమాజానికి మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఒక కీలక అడుగుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీపై విశ్వాసంతో పనిచేసే కార్యకర్తలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
