బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై27
బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం–కోట్రెపల్లి మధ్య వెలసిన శ్రీ కాలభైరవేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా కుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగాఆలయ పరిధిలోని రైతులు ప్రతిఏటా ఆలయంలో శ్రీ కాలభైరవేశ్వరస్వామి ని జలంతో నింపి,అభిషేకంచెప్పటి ఈ ఖరిఫ్ సీజన్లో వర్షాలు బాగా కురిసి పంటల దిగుబడి పెరిగి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకొంటారు. అనంతరం అర్చకులు శరవణ,నవీన్,భాస్కర్ గురుకుల్ బృందంచే శాస్త్రోక్తంగా కుంభాభిషేకం, పంచామృత అభిషేకం,విశేష పూజలు చేశారు. నిర్వాహకులు భక్తుల కుఅన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.
