బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29
బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి గ్రామ పంచాయితీకి చెందిన పట్నపల్లి లో వెలిసివున్న హస్తగిరి కల్యాణ వెంకన్న ఆలయంలో బుధువారం కన్నులపండువగా గురు పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేకం, రాత్రి శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనం పై ఆశీనులుచేసి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం, గరుడసేవ చేపట్టారు.ఈ కార్యక్రమంకు ఉభయదారులుగా వేలుపల్లి వాస్తవ్యులు మడివిల్లి నారాయణప్ప మరియు వారి కుమారుడు సుబ్రహ్మణ్యం దంపతుల చేత నిర్వహించబడినది.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
