ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 13(గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మేజర్ పంచాయతీ బాలాజీ కాలనీ వద్ద వెలసిన సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ వద్ద ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి స్వామివారి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు భక్తులు కర్పూర హారతులు మెక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాయల్ చెరువు, లతా బాలాజీ, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, కోశాధికారి గౌతమ్ రాజు, ఉప కోశాధికారి చిరంజీవి రెడ్డి భక్తులు కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!