ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరులో పిజిఆర్ఎస్ కు మూడు అర్జీలు

పిచ్చాటూరులో పిజిఆర్ఎస్ కు మూడు అర్జీలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 15:
పిచ్చాటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం మూడు అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సమర్పించిన సమస్యలు, వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎంపీడీవో మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, మండల ప్రజలు తమ సమస్యలను పీజీఆర్‌ఎస్ వేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అందిన వినతుల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.
కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!