ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కన్నుల పండువగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కన్నుల పండువగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) :

కార్వేటి నగరంలో వెలసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి, అమ్మవార్లను కమనీయమైన బంగారు కవచాలతో అలంకరించారు. చిన్నారులు కృష్ణుని వేషధారణలో ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పలమనేరు పట్టణ హిందూ బంధువులు, విశేష సంఖ్యలో శ్రీకృష్ణ భక్తులు, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!