బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు11
బైరెడ్డిపల్లి మండలం లోని మర్రిమానుచేన్లు గ్రామంలో మంగళవారం
శ్రీ మారెమ్మ తల్లి ఆలయ మండల అభిషేక వేడుకలు ఘనంగా ముగిసింది. ఆలయ ప్రతిష్ట అయిన తరువాత సంప్రదాయానుసారంగా కొనసాగే మండల అభిషేక వేడుకలు ముగియడంతో మంగళవారం అమ్మవారికి పంచామృత అభిషేకం,విశేష పూజలు ను అర్చకులు గురుప్రసాద్ స్వామి చే కొనసాగింది.ఈ సందర్భంగా ఆలయంలో వివిధ హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
