కార్వేటినగరం సెప్టెంబర్ 15 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటి నగరంమండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఎం ఎం విలాసం సచివాలయం, ఎన్ ఆర్ కండ్రిగ, కేశవ కుప్పం గిరిజన కాలనీ, కేకే కండ్రిగ అంగన్వాడి పాఠశాలలును కలిపి గుండు గాని దళితవాడ
అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో పోషణ్ మాసం 2026 – మన అంగన్వాడి మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ
మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పిల్లలు తల్లిదండ్రులు టీవీలకు, కాలక్షేపం మాటలకు స్వస్తి చెప్పి పిల్లలతో గడపాలని అలాగే మొబైల్ ఫోన్లకు పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో
అంగన్వాడి కార్యకర్తలు మమత,శాంతి,జ్యోతి, రమణమ్మ, నీలవేణి, చాందిని
అంగన్వాడి సహాయకులు, తల్లులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
తల్లుల కాలక్షేపం చేస్తూ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకండి
RELATED ARTICLES
