కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్):
శాంతిపురం మండలంలో పలు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి బుధవారం ఈ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.
శాంతిపురం మండలంలో గ్యాస్ డెలివరీ సరైన పద్దతి లో అందజేస్తున్నారా లేదా అని ప్రజల ను అడిగి తెలిసుకున్నారు. ఒక వినియోగదారు గ్యాస్ కాన్సెల్ అయింది అని తేలియజేయగానే ఆర్డీవో సదరు గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడి వెంటనే గ్యాస్ ఇప్పించడం జరిగింది. సదరు వినియోదారు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం తరువాత శాంతిపురం నందు ఏర్పాటు చేయబడుతున్న హెల్త్ ఫ్యాబ్, ఆటోనెక్స్ట్, మానస్ సరోవర్, కింగ్స్ వుడ్ కంపెనీ ల కోసం భూములను పరిశీలించడం జరిగింది.
