మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని CM చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. అమరావతిలో కుప్పం టీడీపీ నేతలతో ఆదివారం సీఎం సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కుప్పం అభివృద్ధి, రాజకీయాలపై చర్చించారు. క్లస్టర్, యూనిట్, మండల స్థాయి ఇన్ఛార్జ్లు కీలకమని, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు వారిని సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు.
