పలమనేరు, జూన్ 16 గరుడ ధాత్రి : పెద్దపంజాణి మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిత్తూరులో ఎస్ఐ గా విధులు నిర్వహించిన సురేష్ బాబు సోమవారం బదిలీపై పెద్దపంజాణి మండలానికి వచ్చారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అయిన ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వారు చర్చించారు.
ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపంజాణి నూతన ఎస్ఐ సురేష్ బాబు
RELATED ARTICLES
