గరుడ ధాత్రి న్యూస్ జులై 21
మైదుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పందిటి నడిపి సుబ్బరాయుడు మరియు ఓబులమ్మ దంపతులు ఇటీవల జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం ఎంతో బాధాకరం.
ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి దివంగత దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తూ, పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా పందిటి నడిపి సుబ్బరాయుడు ను స్మరించుకున్నారు.వారి సేవలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వెంట కనీస వేతనాల సలహా మండలి సభ్యులు దాసరి బాబు, మైదుకూరు పట్టణ టీడీపీ కన్వీనర్, చాపాడు మండల కన్వీనర్ వెంకటసుబ్బారెడ్డి (వైట్) ,అన్నవరం సుధాకర్ రెడ్డి, పందిటి పెద్దయ్య, మాదం రమణ (డీలర్), పందిటి సురేష్ (డీలర్) , అలాగే పార్టీ నాయకులు ఉన్నారు.
