చౌడేపల్లి ఆగస్టు 05 గరుడ దాత్రి న్యూస్
దేశ రాజధాని న్యూఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, యువజన విభాగం చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంపీ పీవీ మిథున్ రెడ్డిని మిద్దింటి కిషోర్ కోరారు.చౌడేపల్లి మండల విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ అంశంపై ఎంపీ పీవీ మిథున్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మిద్దింటి కిషోర్ వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత స్థాయిలో కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
