శ్రీ వేదన్నారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో మత్సవతార వేదనారాయణ స్వామి వారిని శనివారం సత్యవేడు శాసన సభ్యులు కోనేటి అధిమూలం దర్శించికొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు, సత్యవేడు గంగమ్మ ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దుస్సాలువతో సన్మానం చేసి, దేవుని ప్రసాదంతో శాసన సభ్యులుకి పూలమాలతో సత్కరించారు. అనంతరం నాగలాపురం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరణ చేసి, యువతకు కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలును గురించి వివరించారు. అధికారులును కేవీబీ పురం మండలంలో జరగబోయే జాబ్ మేళా విషయాన్ని అన్ని పంచాయతీ లోని నిరుద్యోగ యువతీ, యువకులుకు పంచాయతీ కార్యదర్సులు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజ బట్టాచార్య మాజీ ఎంపీపీ మురళి, సెల్వ కుమార్ రాజమాణిక్యం శెట్టి విజయ, మణి, నారాయణ, పరుసరాం శిల్పి, ఎం ఆర్ ఓ, ఏఓ, ఎం ఈ ఓ, ఎస్ ఐ, పంచాయతి కార్యదర్శులు, కూటమి నాయకులు, కోనేటి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
