-నెల్లూరు మహానాడుకు శ్రీధర్ వర్మ
కు అవకాశం
ఈనెల 26, 27, 28 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు మీడియా కమిటీ సభ్యుల్లో శ్రీధర్ వర్మను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప ల్లా శ్రీనివాసరావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తనపై బాధ్యతతో నెల్లూరులో జరుగునున్న మహానాడు పండుగకు మీడియా కమిటీ సభ్యులుగా ఎంపిక చేయడం పట్ల పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ కోసం తాను మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేశారు. ఈయన ఎంపిక పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హ ర్షం వ్యక్తం చేశారు.
