కార్వేటినగరం జూలై 19 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటినగరంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో ఆదివారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె హరిద్రవం చందనం పసుపు తో కూడిన అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద నాగరాజ్ యాదవ్ రూప వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు వీధి చెందిన మురగారెడ్డి అమ్మవారికి ఉమా గోల్డ్ నగలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, ఉప కోశాధికారి సాయి రాయల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
