గరుడదాత్రి న్యూస్ మైదుకూరు జులై 20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి జూలై 31 వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.396 అమలులోకి వస్తే అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే జీవో నెం.396ను రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
