ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్క్రీడల్లో రాణించండి జిల్లాకు మంచి పేరు తేవాలి

క్రీడల్లో రాణించండి జిల్లాకు మంచి పేరు తేవాలి

📰 Generate e-Paper Clip

-ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు ఆగస్టు 10 (గరుడ ధాత్రి న్యూస్)విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చాడు. సోమవారం మెసానిక్ మైదానంలో నిర్వహించిన “మన అమరావతి ఛాంపియన్ షిప్ 2026” పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీ పరీక్షలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇటీవల నిర్వహించిన డీఎస్సీ లోనూ క్రీడల్లో రాణించిన వారికి పోస్టింగ్స్ కల్పించినట్లు చెప్పారు. మెసానిక్ మైదానం అభివృద్ధికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి రూ.2.78 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది కల్లా మరిన్ని సౌకర్యాలుకల్పిస్తామన్నారుక్రీడలకు సంబంధించి ఖాళీల భర్తీకి చర్యలుతీసుకుంటామన్నారు.ఈకార్యక్రమంలోచుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డీఎస్డీవో ఉదయ్ కుమార్, పీడీలు, పీఈటీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!