ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం: రాష్ట్ర వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రామచంద్రాపురం మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ మధుసూదన్‌రావుకు వినతిపత్రం అందించారు. వీఆర్ఏలకు వీఆర్వోలుగా వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా పదోన్నతి కల్పించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టే ధర్నాకు వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!